Monday 25 February 2013


                                                          నమో హిందుమాతా మాతా సుజాతా!!!




శ్రీ మాన్ బుధ్ధ ప్రసాద్ గారూ! నమస్కారాలు. తెలుగు అభివృధ్ధికి మీరు చేస్తున్న అవిరళ కృషిని మనసారా అభినందిస్తున్నాం. 

తెలుగు జాతికి అనర్ఘ రత్నమైన ఒక ప్రాచీన ప్రాచుర్య గీతాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాం.. దానిని పునరుజ్జీవింపజేసి ఈ తరానికి ఆతరం ఘనతను తెలియజేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు ఆరు దశాబ్దాలకిందట ఈ గేయ రత్నం కనీసం అయిదో తరగతి వరకు పాఠ్య పుస్తకాల్లో ఉండేది. విద్యార్ధినీ విద్యార్ధులకు కంఠోపాఠం గా ఉండేది. మాన్యులు మీ తండ్రిగారు దివంగత వేంకట కృష్ణారావు గారు కూదా చాలా ఇష్టపడిన గేయం. దీని ప్రాభవం మీకు తెలీదనే ధైర్యం చేయలేము..

దీనికి మళ్ళీ బహుళ ప్రాచుర్యం కల్పించి .. విపుల హిమాద్రులు, వేణీభరము, కంఠహారము, కటిసూత్రము, గోలకొండ, 
రత్నకోశము, కోహినూరు, తాజమహలు వంటివాటిని ఈ తరానికి, భావితరానికి శాశ్వతంగా గుర్తుండే మాదిరి చర్య తీసుకోవాలని, రాష్ట్రప్రాభవం తెలిపే ఈ గీతాన్ని సభలలో వినిపించేలా చొరవ తీసుకోవాలని అభ్యర్ధిస్తున్నాం. పూర్తిగా కనుమరుగైన ఈ గీతాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చిన ఘనత తెలుగింటి ఆడపడుచు, తెలుగు భాష వీరాభిమాని, సోదరి శ్రీమతి భావరాజు పద్మినిది. ఆమెను అభినందిస్తున్నాం. మీనుంచి అటువంటి భాషాభిమానులకు ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం.... 
----------------------

"నమో హిందుమాతా మాతా సుజాతా
నమో జగన్మాతా
అమోఘ దివ్య మహిమ సమేతా
అఖండవర భరతఖండ మాతా
విపుల హిమాద్రులే వేణీభరముగ
గంగా యమునలె కంఠహారముగ
ఘన గోదావరి కటి సూత్రమ్ముగ
కనులకు పండువ ఘటించు మాతా
గోలకొండ నీ రత్నకోశమట
కోహినూరు నీ జడలో పూవట
తాజమహలు నీ దివ్య భవనమట
ఆహాహా నీ భాగ్యము మాతా!!"
----------------------


మీకు చిరపరచితుడనైన

నందిరాజు రాధాకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్.

No comments:

Post a Comment