Tuesday 19 March 2013




                    నందమూరి తారక రామారావు నినాదం





నందమూరి తారక రామారావు వలన తెలుగు ఆత్మగౌరవ నినాదంతో పాటు ముఖ్యంగా మూడు పాటలు నేల నాలుగు చెరగులా ప్రతిధ్వనించాయి. 1) మా తెలుగు తల్లికీ మల్లెపూదండ... 2) చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా.. 3) సారే జహాసె అచ్ఛా...మళ్ళీ ఆ పాటలు మరుగున పడ్డాయి. 

తెలుగు ప్రజల నోట్లో ఎప్పుడూ నానిన మరో పదం.. "చైతన్య రథం". ఆ ప్రభావమే ఈ నాటి రథయాత్రలు, బస్సు యాత్రలు. ప్రజలలోకి వెళ్ళి ఊరూరా గుండె తలుపులను తట్టి రాజకీయాలలో పెనుమార్పులు తెచ్చింది ఎన్ టి రామారావు. ఆ మార్గాన్ని అనుసరించింది ఇందిరా గాంధి. వీటన్నిటికీ ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే గాక ఆ చైతన్య చక్రాలను ఆర్నెల్ల పాటు అనుసరించడం ఒక గొప్ప అనుభవం. ఇందిర పర్యటనల్లో...వై ఎస్సార్ యాత్రల్లో కూడా అడుగులు వేసే అరుదైన అవకాశం కలగడం పాత్రికేయ వృత్తి ప్రసాదమే.. 

ఈ దేశంలో పాద యాత్రకు ఆద్యుడు ఆదిశంకరాచార్యుడు. రాజకీయా పాద యత్రకు శ్రీకారం చుట్టింది మాజీప్రధాని చంద్రశేఖర్. లబ్దిపొందింది రాజశేఖరరెడ్డి.

No comments:

Post a Comment