Thursday 3 October 2013



గరం గరం  పకోడీలు.. 
 
**రాజకీయాల్లో ఉచ్ఛనీచాలుండవు. పొగిడిన నోళ్ళతో తెగనాడుతారు. శాపనార్ధాలు పెట్టిన గళాలే సంకీర్తనలు గానం చేస్తాయి. నిన్నటి వరకు "పాపాల పుట్ట జగన్" అన్న మొయిలీ, దిగ్విజయ్, చాకో.. ప్లటు మార్చేశారు. రేపు సోనియా కూడా జగన్ను ఆలింగనం చేసుకుంటారు. ఎదురుగా కుంభకోనాల ఊబి, ఒక వైపు మోడీ, మరోవైపు తెలంగాణ, ఇంకోవైపు జగన్..కాంగ్రెస్ కు అష్టదిగ్బంధనం, అంత్యకాలం. అదే అవసరం వారిని కాళ్ళా వేళ్ళా పడేటట్లు చేస్తున్నది...
**చిలకమర్తి వారు సాక్షాత్తు మధుర మీనాక్షి హస్తభూషణులు(మీనాక్షి చేతిన చిలుక ఉంటుంది కాదా!)ఆయన ప్రముఖ కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కరణవాది, విద్యావేత్త. తొలుత ఆయన "స్రవంతి" పత్రికలో సహాయ ఎడిటర్‌గా రంగప్రవేశం చేశారు. 1916లో వారు "మనోరమ", "సరస్వతి" పత్రికలను లను స్థాపించి గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. అది సాహితీ సేవ. వారి స్వీర రచన "గయోపాఖ్యానం"లో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుని వేషం కట్టేవారట.. అందుకే వారిని మహనీయులు, మహాపురుషులు అని అన్నారు. వారి సేవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం "కళాప్రపూర్ణ" బిరుదుతో గౌరవించి ధన్యతనొందింది.**నవ్వడానికి, నవ్వించడానికి ఎప్పుడూ నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి - ఎవరైనా నవ్వించ గలిగే నేస్తం ఉంటే వారి సాంగత్యంలో క్షణాలు, నిముషాలు, గంటలు, రోజులు.. గడపండి. కుటుంబంతో, మిత్రులతో కలిసి కడుపు చెక్కలు అయ్యేలా నవ్వండి! నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవదం ఒక రోగం...**జగన్ కు బెయిల్ ఇవ్వక పోతే---- కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కు రాజకీయం; - వై ఎస్ ఆర్ సి పి జగన్ కు బయిల్ ఇస్తే
---- కాంగ్రెస్-వై ఎస్ ఆర్ సి పి కుమ్మక్కు రాజకీయ; - టిడిపి. జగన్ కు బెయిల్ రాదు -- ఒక వర్గం మీడియా,దేవుని దయ వలన జగన్ కు బెయిల్ -- మరోవర్గం మీడియా, జైలులోకి జగన్ - ఒక మీడియా,జనంలోకి జగన్ - వేరొక మీడియా, ఎవరి అజెండా వారిది. కానీ మోచేతి కింద నీళ్ళు తాగే వర్గం ఎప్పుడూ ఉంటుంది.ఏ ఎండకాగొడుగు..అదే ఊసరవెల్లి కలం, గళం, కులం:**ఒక రామోజీ రావు కోసం, మరొక జగన్మోహన్ రెడ్డి కోసం, వేరొక వెంకట్రామిరెడ్డి కోసం, ఇంకొక సూర్య ప్రకాశరావుకోసం, మరో వేమూరి కోసం పత్రికాస్వేచ్చ అంటూ రోడ్డెక్కే జర్నలిస్టు సంఘాలు, సుమారు 135 సంవత్సరాల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన ఒక జాతీయ (కాదు అంతర్జాతీయ) ఖ్యాతి నొందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హైదరాబాద్ కేంద్రం రెసిడెంట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ మోఓ డు దశాబ్దాల పాత్రికేయ అనుభవంకలిగి, సౌమ్య్త్డుగా, వివాద రహితుడుగా సాగుతున్న శ్రీ నగెష్ కుమార్ పోల్లీసు కేసు వలన కు జరగరాని అవమానం జరిగితే నోళ్ళు ఎందుకు పెగలలేదు? రోడ్లపైకి ఎందుకు రాలేదు. ఆయనకు నైతిక బలం చేకూర్చేందుకు పాత్రికేయులు ఎందుకు న్యాయ పరమైన చర్యలు ప్రారంభించలేదు? సంఘీభావం గా కనీసం ఒక్క నిరసన ప్రదర్శన లేదు, విధుల బహిష్కరణ లేదు. రోజు సమ్మె కూడా చేయలేక పోయారు? ఆయనపై కేసు వ్య్క్తిగతంగా కాదు. మహామహులుగా భుజకీర్తులు తొడుక్కున్న సంపాదకులు, ఒక్కరూ పెదవివిప్పలేదు. ఒక పాత్రికేయునిగా నమోదయింది. వ్యక్తిగత నేరాలపై జైలుకెళ్ళిన వాళ్ళకోసం రోజూ డ్భోజనాల చ్యరేజీలు తీసుకుని యూటీలేసుకుని మరీ తిరుగుతారు మన 'ఎర్నలిస్టులు'. ఇదీ తెలుగు నేలపై జర్నలిజం దౌర్భాగ్యం..Like · · Share
**రాజకీయ నాయకులను మించి ప్రాంతాలుగా జర్నలిస్టులుకూడా చీలిపోయారు. కలాలు ఒరిగిపోయాయి. పాళీలు విరిగియాయి. కలలు చెదిరిపోయాయి. విలువలు వలువలు విప్పేశాయి.**మంత్రివర్గాన్ని బర్త్‌రఫ్ చేయ్యాలని అనేక పర్యాయాలు విపక్షాలు గవర్నరును కోరినప్పుడు, ప్రధానిని తొలగించాల్;అని రాష్ట్రపతిని అడిగినప్పుడు కూడా అనేక పర్యాయాలు వారు సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా కాదుపొమ్మని కసురుకోరు. ఊడపీకుతామని హామీ ఇవ్వరు. "కొంగు ముడివేసుకుని ఎమ్మెల్యే దంపతులు, మంత్రుల సతీమణులు సమైక్య రాష్ట్రం కోరుకున్నారని తెలుగు పత్రికలు కథనాలు అల్లినాయి. శిలాక్షరాలు చెక్కినాయి".**నేను ఈరోజు దిన పత్రికలో ఒక వార్త చదివాను:సంబంధిత ఫొటొ చూశాను. కొత్తా దేవుడండి..కొంగొత్తా దేవుడండీ!! రాష్ట్రంలో ఉన్నవి చాలవన్నట్లు.. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం అనే కొత్త కలం బృందం ఆవిర్భవించింది. కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఒక సీనియర్ జర్నలిస్టు కూడా మేధావి స్థాయి నేతగా ఎదిగాడు. "
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో నెలకొన్న అశాంతి, ఉద్యమాలు, ఆందోళనలను చల్లార్చేందుకు కెంద్రం తక్షణం అన్ని రాజకీయ పార్టీలతో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని (జెపిసి) ఏర్పాటుచెయ్యాలని డిమాండ్ చేసింది. జెపిసిలో అన్ని రాజకీయ పక్షాలు తమ వైఖరిని లిఖితపూర్వకంగా ప్రకతించాలని , నెల రోజుల్లో అమోదయొగ్యమైన పరిష్కారాని సూచించాలని పేర్కొంది. ఆదివారం హైదరాబాద్ లోని ఓ హోటల్లో సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాలతోపాటు, తెలంగాణ లోని నాలుగు జిల్లాల పాత్రికేయులు పాల్గొన్నట్లు కార్యక్రమ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు....."(చూడుడు "ఈనాడు" ఆరోపేజీ కుడివైపు కింద). రాష్ట్రం నేడీ దౌర్భాగ్య పరిస్థితులకు చేరుకోవడానికి నిప్పు పెట్టి ఆజ్యం పోసింది ఈ ఘనులే కదా!! ఈ కొత్తదేవుళ్ళను వెనుకనుంచి నడిపిస్తున్న నిర్వాహకులెవరు? ఈ ఎపిజీఫ్ ఎవరి సృష్టి? ఆ సమావేశం ఎందుకంత గోదమీదపిల్లిలా వ్యవహరించింది? రెండు ప్రాంతాల ప్రజల ఉద్యమాన్ని ఎపిజీఫ్ గౌరవించిందట. ఎంత ఔదార్యం. రాష్ట్ర ప్రజల జన్మ ధన్యమైంది. ఈ సమస్య నుంచి వారిని రక్షించేందుకు సాక్షాతు దేవతలే దిగి వచ్చారు.**వృక్షో రక్షతి రక్షితః..యాచకో యాచకః. శత్రు. మాయరోగ మదేమొ కాని జర్నలిస్టుకు జర్నలిస్టుకు పొసగదు..**ఏడాది నలిగిన తరువాత పెళ్ళి చూపులు. తరువాత ఏడాదికి నిశ్చయ తాంబూలం.. మరో ఏడాది గదిచిన పిమ్మట ముహూర్త సమాలోచన.. ఇంకో ఏడాదికి ముహూర్తం..రెండేళ్ళ తరువాత పెళ్ళి, ఆ తరువాత ఏడాదికి కాపురం. అయినా అప్పటికీ మూడు నిద్రల ముచ్చట తీరలేదు.తాళి లేని, బాజాలు మోగని, పురోహితుడు రాని పెళ్ళి..ఇక ఆపెళ్ళిలో త్రిల్ ఏముంటుండి? అసలు పెళ్ళయినట్లా లేదా? జవాబులేని ప్రశ్న..తెలంగాణా ప్రకటన అయినా, జర్నలిస్టుల అవార్డుల బహుకరణ అయినా అంతే.. ఎండమావులే!!!

No comments:

Post a Comment