Tuesday 8 October 2013

వాడి వాడి వార్తలు- వేడి వేడి వాతలు(వ్యాఖ్యలు) 


**అధికారం తలకెక్కితే పర్యవసానం అంధకారమే ... కరెంట్-షాక్ అబ్సార్బర్స్ కోసం వెదకులాట..

**సాక్షాత్తు వారం కిందట వరకు రెండేళ్ళకు పైగా రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిగా(డిజిపి) పనిచేసిన వ్యక్తి నేరుగా ముఖ్యమంత్రిపై ఆరోపణాస్త్రాలు సంధించారు. ఇంతకంటే ఈ రాష్ట్రానికి పట్టే అధోగతి ఇంకేముంటుంది? ప్రజాస్వామ్యం, ప్రభుత్వ గౌరవం,ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు నిలబడాలంటే వెంటనే ఇద్దరిపై సుప్రీం కోర్టు న్యామూర్తిచే దర్యాప్తు చేయించి నిజాలు నిగ్గు తేల్చాలి. దోషులెవరైతే వారిని శిక్షించాలి. దేశానికే మార్గదర్శకంకావాలి.

**టీవీ వార్త: జగన్ కు, బాబుకు డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు..బిపి, సుగర్ లెవెల్స్ పడిఫొతున్నాయి-
జన వ్యాఖ్య: నిజమే అన్ని లెవెల్స్ పడిపోతే కదా నాయకులయ్యేది.
వార్త: నీరసించిపోయారు, తలనెప్పి వస్తోంది-
వ్యాఖ్య: అధికారం లేక నీరసించిపోతున్నారు, దీక్షలతో తలనొప్పే కదా!!

**MODATA SWARNAAMDHRA VINNAM. TARUVAATA HARITAAMDHRA VINNAM. IPPUDU PRATYAKSHAMGA AMDHAANDRA ANUBHAVISTUMNAM. AAMDHRA ENTA PUNYAM CHESUKUMDO KADAA?

**I WONDER. HOW MANY TIMES POLITICIANS TAKEUP FAST UNTILL DEATH.

**Responding to cm's appeal, power Employees agreed to restore electricity in six dts. Is it not evident that the aggitatipn is govt sponsored?

**I do not know whether govt(cm) is ruling the state or SAMAIKYS JAC IS RULING?

**స్వదేశీ హస్తంలో విదేశీ ప్రమేయం ఇలానే ఉంటుంది లేండి..

**పుట్టి బుద్ధెరిగిన తరువాత పొట్టిశ్రీరాములు మినహా దీక్షల్లో మరణించిన వాళ్ళు ఒక్కరూ కనబడలేదు. దీక్షల వలన అల్లర్లలో మరణాలు జరిగాయి. పెద్దలు మీరే చెప్పాలి. ఘుమ ఘుమ లాడే వంటావార్పుకు ఇంటిల్లిపాదీ విస్తళ్ళేసుకుని పంక్తికి సిద్ధమవుతున్నారు..

** రాజకీయాలు మాస్ హిస్టీరియా అని (వి)నాయకుల అపోహ. తిరగ"బడితె" పూజ తప్పదని తెలిసుకుంటున్నారు.

**ఆంధ్రలో సాగుతున్నది సామాన్య అంధకారం కాదు. అది రాజకీయ అధికార మదాంధకారం. ప్రజలు సమిధలవుతున్నారు. ప్రజాప్రతినిధులు పదవులు పట్టుకు వేలాడుతున్నారు. ఉద్యోగులకు రెందునెలలుగా జీతాలు లేవు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతినెలా జీతభత్యాలు అందుకుంటున్నారు. జనాలకు బస్సులు, రైళ్ళు లేవు కాని మంత్రులు, ప్రజాప్రతినిధులు వారానికి రెండేసి మార్లు విమానాల్లో డిల్లీకి వెళుతున్నారు. ఏపీభవన్లో ఉచితంగా, రాయితీలపై బస, వసతులు అనుభవిస్తున్నారు. భక్తులకు తిరుమలేశుదు, సిమ్హాచలం అప్పన్న, అన్నవరం సత్తెన్న, శ్రీశైలం మల్లన్న, బెజవాడ కనకదుర్గ దర్శన భాగ్యం లేదు. నేతలు మాత్రం జనపథ్ లో అమ్మ దర్శనం చేసుకుని సుప్రభాత భజనతో మొదలై పవ్వళింపు సేవవరకూ నిత్య భజనలో మునిగి తరిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కటిక చీకట్లు..నాయకులకౌ కార్పొరేట్ ఆస్పత్రుల్లో మిరుమిట్లు. మంత్రులు, ఎమ్మెల్యేల నివాసాల్లో ధగధగాయమాన వెలుగులు.. నేతల ఆస్తులకు రక్షణ..ప్రజలకు లాఠీ దెబ్బలు, కేసులు..ఆంధ్ర లో నిత్యాగ్నిహోత్ర జ్వాలలు.

**జండా పై కపిరాజు ... రెపరెపలాడుతున్నది. ఢిల్లీ కోటకు  బీటలు వారుతున్నాయి..కాళ్ళు వణకుతున్నాయి,  చేతికి వాతలు మిగులుతాయి. రంగు పడుద్ది. అది ఖాయం!

**Congress met with all head on collision accidents..No scope for recovery..Purely fatal ....

**అమ్మ బొమ్మకు ఇన్నేళ్ళు చెక్క భజనచేసి, యువరాజును నెత్తినెక్కించుకున్న న మంత్రులు, ఎంపీలు ఇక కాంగ్రెస్ లో ఉండలేరట..రాజీనామా చేసి ప్రజల్లోకి వెళతారట? మీరంతా మూకుమ్మడిగా పార్టీ మారడానికి ఏనాడొ సిధ్ధమయ్యారని చంటిపిల్లలకు కూడా రెండేళ్ళ కిందటే తెలుసు. ఈ రాజీనామాల ఏడుపేదో రెండునెల్లకిందటే ఏడిస్తే సరిపోయేదిగా!! 2009 నుంచీ అంతా నాటకం.. ఈ నాటకానికి సూత్రధారి, తెరచాటు సమన్వయకర్త ఎవరో అందరికీ తెలుసు.. సి బి ఐ మేనేజ్‌మెంట్ కూడా ఆయన చలవే! 2014తో ఆయన పదవీ కాలం కూడా పూర్తవుతుంది. ఇప్పుడు అసలు నాటకం మొదలు.

**రేపటినుంచి ముఖాలపై ముసుగులేసుకోవలసింది, వేలాడేసుకోవలసింది, సిగ్గుతో తలలు వంచుకోవలసింది ఎవరో తెలుసా. పొద్దు పొద్దున్నే పాచి ముఖాలతో టీవీల్లో ప్రత్యక్షమవుతూ కథలు వినిపిస్తుంటారే.. వాళ్ళు. వాళ్ళను విశ్లేషకులు, విదూషకులు, రాయని భాస్కరులు, వాచాలకులు అంటారు.

**తెలంగాణా తేచ్చేదీ, ఇచ్చేదీ, లేకుంటే చచ్చేదీ కాంగ్రెస్సే అని పాపం మాజీ మంత్రి జి. చిన్నారెడ్డి ఏముహుర్తాన అన్నారోకానీ, ఇచ్చిన తరువాతకూడా చచ్చింది కాంగ్రెస్సే!! వచ్చింది గొర్రె- చచ్చింది బర్రె!

**STAR BATS MAN AND HIS TEAM LOST THE T GAME. BETTER FOR HENCHMEN AND BENCHMEN TO RETIRE FORTHWITH. CONGRESS ONCE AGAIM CHEATED PEOPLE PF AP.

**MEDIA HAS TOTALLY FAILED IN ASSESSING THE NOD OF UNION CABINET ON TELANGANA NOTE.

**అనర్హత వేటు బారి నుంచి కాపాడే వివాదాస్పద ఆర్డినెన్సు యువరాజు ప్రమేయంతో అటకెక్కింది. అదే మాదిరి తెలంగాణా ప్రక్రియ ఆపే ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని రాహుల్ కన్నెర్ర జేస్తే తెలంగాణా నిలివిపోతుంది. సిడబ్ల్యుసి తీర్మానమైనా, కోర్ కమిటీ నిర్ణయమైనా, యుపీఎ అమోదమైనా, మంత్రివర్గ ముద్ర అయినా, ప్రధాని ఆజ్ఞ సరే యువరాజు ముందు బలాదూరే.. సీమాంధ్ర నాయకులారా రాజీనామాలెందుకు? రాహుల్ కు మొక్కి ప్రసన్నం చేసుకోండి. ఓ పనైపోతుంది. రాష్ట్రపతి సైతం అడుగు ముందుకెయ్యరు. గ్యారంటీ..

**ఈ 66 ఏళ్ళ స్వతంత్ర ప్రజాస్వామ్య ప్రభుత్వంలో కోర్ కమిటీ కంటే, కేంద్ర క్యాబినెట్ కంటే, ప్రధానికంటే కూడా ఒక సాధారణ ఎం పి శక్తిమంతుడన్నమాట. ఆర్డినెన్స్ కోసం సాక్షాత్తు రాష్త్రపతి వద్దకు వెళ్ళిన తీర్మానం ముసాయిదా యు టర్న్ తీసుకున్నది. ఈది స్వతంత్ర భారతమా.. కుటుంబ బానిసత్వ రాజ్యమా!! ఆ తల్లి ఇప్పుడుకూడా నోరు విప్పలేదు..

**అమెరికా వెళ్ళినా మన్మోహన్ వంటి వ్యక్తికూడా విమానంలో కూడా మోడీ గురించి పలవరింతలే.. మోడీకి వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలట.. ఆకాశం నుంచే పిలుపునిచ్చారు. ఆ మాత్రం భయం ఉందన్నమాట. అది మోడీ శక్తి.

**ఆనాడు చంద్రబాబు అంగీకరించనందు వల్లనే తెలంగాణ  ఇవ్వలేక పోయామని బిజెపి నేత ఎల్ కె అద్వాని గతంలో అన్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలు తెలంగాణా వొద్దంటున్నారు. అద్వాని ఇప్పుడేమంటారో?  

**Today is Mohandas Karamchand Gandhi's 144 birth anniversary. He was assasinated 65 years back. Today anchors in Telugu channels, below 35 years age have been talking much about Gandhiji. Really astonishing.

**కొత్తగా ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరంకు తెర వెనుక ఆర్ధిక సహాయదారులు, రాజకీయ సలహాదారులు  ఎవరబ్బా!!!

**మంత్రి డొక్కా కూడా సి.ఎం. కు ఎదురు తిరిగాడంటే రసవత్తర రాజకీయం అర్ధమవుతున్నదనుకుంటా మిత్రులందరికీ...

**ఆర్డినెన్స్ ను కేంద్రం ఉపసంహరించుకుంది. సెభాష్, (అ)ప్రస్తుత ప్రధాని మన్మోహన్‌పై భావి ఫ్రధాన  మంత్రి రాహుల్ గాంధి నెగ్గాడు.

**అమెరికాలో షట్‌డౌన్ వలన 8.5 లక్షల మంది ఉద్యోగులకు అక్టోబరు ఒకటిన  జీతాలు అందలేదట. ఆంధ్రాలొ రెండు నెలలుగా ఉద్యోగులకు  జీతాలు లేవు. అయినా నిక్షేపంగా అదురు బెదురు లెకుందా సమ్మెలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు ఎలా గడుస్తున్నాయో? కోట్ల రూపాయల్లో ఉద్యమానికి సొమ్ము ఎలా వస్తున్నది మరి? గుప్త(రహస్య) ఫైనాన్షియర్ ఎవరు?

**కేంద్రంలొ మన్మోహన్ మీద, రాష్ట్రంలో కిరణ్ మీద కాంగ్రెస్  కు మోజు తీరింది. అందుకే ఈ కొత్త నాటకాలు. ఇద్దరూ ఇద్దరే. ఎవరూ రాజీనామా చెయ్యరు.  

**చివరకు మంత్రి డొక్కా కూడా సి ఎం కు వ్యతిరేకమైపోయాడు. జగన్ కాంగ్రెస్స్ లోకి దూకే 8 మంది మంత్రుల బ్యాచ్‌లొ ఈయనొకడు

No comments:

Post a Comment